గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

న్యూఢిల్లీ : గ్రీన్ ఇండియా మిషన్ కింద రాష్ట్రానికి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుధీర్ఘ తీర ప్రాంతాన్ని తుపానులు, ఉప్పెనలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించు కునేందుకు, తీర ప్రాంత కోత నివారణ చర్యల్లో భాగంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్తున్నాం అని చెప్పారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌. ఇప్పటికే మూడు జోన్లుగా విభజించి 450 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరగా, మిస్టీ నుంచి నిధులు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు.

భావితరాల భవిత కోసం పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సమన్యయంతో ముందుకు వెళ్తాం అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గోదావరి కాలుష్య నివారణ అంశంపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహకారం కూడా కోరనున్నాం అన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి , తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ , లింగమనేని రమేష్ , శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే , పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *