ఏపీలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాలి


దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ఈనెల 21న యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వహించాల‌ని ఆయ‌న ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. యోగాంధ్ర నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై సచివాల‌యంలో కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొంటాన‌ని చె్ప్పారు సీఎం.

21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్టేట్ ఈవెంట్‌ నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ ను, ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు. స్టేడియంలో 5 వేల నుంచి 6 వేల మందితో యోగా కార్యక్రమం ఉంటుంద‌న్నారు. బాబా రాందేవ్ సహా ప‌లువురు యోగా ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్రకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని స్ప‌ష్టం చేశారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా…. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

  • Related Posts

    త‌ప్పుడు ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్దం : హైడ్రా

    హైద‌రాబాద్ : హైడ్రా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల‌పై హైడ్రా ముమ్మ‌ర విచార‌ణ చేప‌ట్టింద‌ని, కానీ కొంద‌రు దీనితో త‌మ సంస్థ‌కు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. తెర వెనుక డీఐఈవోలు, ఉన్నతాధికారులు, హైడ్రా…

    ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ పై కొడుకు షాకింగ్ కామెంట్స్

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్న రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ పై స్వంత కుమారుడు సంతోష్ గౌడ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న తండ్రి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *