శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం డీకే శివ‌కుమార్

త‌న‌తో పాటు కుటుంబం కూడా స్వామి ద‌ర్శ‌నం

తిరుమ‌ల : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే కొలువు తీరారు డీకే శివ‌కుమార్. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు. త‌న సార‌థ్యంలోనే పార్టీ రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇంకా రెండేళ్ల పాటు ఆయన సీఎంగా ఉంటారు రాష్ట్రానికి. త‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంలో ఏదో ఒక రోజు ముఖ్య‌మంత్రి కావాల‌న్న‌ది త‌న క‌ల ఆయ‌న ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. డీకే శివ‌కుమార్ తో పాటు త‌న భార్య‌, కూతురు, కుటుంబీకులకు తిరుమ‌ల‌లో కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే వ‌ల్ల‌మాలిన భ‌క్తి, అభిమానం కూడా. ఇటీవ‌లే తాను ముఖ్య‌మంత్రి పీఠంపై ఆశీసుల‌య్యారు.

ఈ సంద‌ర్బంగా స్వామి వారిని శుక్ర‌వారం ద‌ర్శించుకున్నారు త‌న స‌తీమ‌ణి, కుటుంబంతో క‌లిసి. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కాలు మోపిన తన‌కు ప్రోటోకాల్ ప్ర‌కారం ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు. ఆచార్యులు, పురోహితులు, పూజారులు, ఆల‌య అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా డీకే శివ‌కుమార్ మీడియాతో మాట్లాడారు. నా అర్ధాంగితో కలిసి తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గర్భాలయాన్ని సందర్శించి, స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నాను. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశాను . జగదుద్ధారకుడైన శ్రీనివాసుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించిన‌ట్లు తెలిపారు సీఎం డీకే శివ‌కుమార్.

  • Related Posts

    శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

    తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…

    కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం

    తిరుప‌తి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *