అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు

25 మందిపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న సిట్

ఉత్త‌ర ప్ర‌దేశ్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్ప‌ట్లో అద్వానీ సార‌థ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేప‌ట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే దాదాపు రూ. 1400 కోట్లు పోగు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీటికి సంబంధించి లెక్కా ప‌త్రం లేకుండా పోయింది. తాజాగా అయోధ్య మందిర నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంద‌ని గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. హిందూ బంధువులు కొంద‌రు దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. చివ‌ర‌కు కేసుల న‌మోదు దాకా వెళ్లింది. ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ కేసుకు సంబంధించి తాజాగా అప్ డేట్ వ‌చ్చింది. అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో 150 మంది అనుమానితులను గుర్తించింది సిట్.

దాదాపు 25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఐదుగురు ప్రధాన నిందితులు లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం తీసుకున్నారు. అలాగే ఒక మహిళా భక్తురాలు మందిరంలో తన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన కేసు కూడా దర్యాప్తు జ‌రుగుతోంది. జూన్ 7న రామ మందిరంలో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల డబ్బులు దొంగిలించారని యూపీ మాజీ మంత్రి పవన్ పాండే ఆరోపణలతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

  • Related Posts

    నాగార్జునసాగర్‌లో సీఎం ‘వరుణ యాగం’

    న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలో వ‌ర్షాలు కురియాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వ‌రుణ యాగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. యాగం సంద‌ర్బంగా…

    శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు

    తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *