టీఎంసీ చైర్ ప‌ర్స‌న్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ తొల‌గింపు


తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా అరూప్ రాయ్

కోల్ క‌తా : టీఎంసీ పార్టీ ఫౌండ‌ర్ , చైర్ ప‌ర్స‌న్ గా ఉన్న మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. త‌న‌ను పార్టీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు తిరుగుబాటు టీఎంసీ నేత రితాబ్రత బెనర్జీ .అరూప్ రాయ్ తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా ఉంటారని ప్ర‌క‌టించారు. ఆర్థిక అవకతవకలను పరిశీలించడానికి, పార్టీ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయడానికి ఒక ప్రత్యేక ఆడిటర్‌ను నియమించాలని తాము నిర్ణయించిన‌ట్లు వెల్ల‌డించారు. మమతా బెనర్జీ గనుక టీఎంసీకి ప్రధాన సలహాదారుగా ఉండాలని అనుకుంటే, ఆమెకు సాదర స్వాగతం ప‌లికేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు.

తాజా అప్‌డేట్ల కోసం మా హ్యాండిల్‌ను అనుసరించండి. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సమావేశం అయ్యారు. తాము “అసలైన TMC”గా పేర్కొన్న వర్గానికి సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను చైర్‌పర్సన్‌గా ప్రకటించారు . ఈ నిర్ణయంతో, మమత పార్టీ చైర్‌పర్సన్ పదవిని కోల్పోయారని అసమ్మతివాదులు ప్రకటించారు. అయితే ఆమె విధేయులు మాత్రం ఆమెనే పార్టీ అధినేతగా కొనసాగుతున్నారని వాదించారు.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *