రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

విజ‌య‌వాడ : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది రౌడీ షీట‌ర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన సీఐ నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్బంగా కోర్టు న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి. కృష్ణలంక పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ ఉన్నాడు. తీవ్ర గాయాలకు గురై మరణించి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ సిట్. ఈఘ‌ట‌న అనంత‌రం సీఐ నాగ‌రాజు ప‌రార‌య్యాడు. ఈ స‌మ‌యంలో మే 6న సాయికృష్ణను మార్కాపురంలో పట్టుకుని కృష్ణలంక పీఎస్‌కు తీసుకువచ్చారు.

సాయికృష్ణ పోలీసు కస్టడీలో ఉన్న విషయాన్ని దాచి పెట్టారు. కావాలనే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపింది. ఇదిలా ఉండ‌గా సాయికృష్ణకు సంబంధించిన ఆధారాలన్నీ నాశనం చేశారని ఆరోపించింది. కీలక CCTV ఫుటేజ్ డిలీట్ చేశారని బాంబు పేల్చింది. సీఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని కోర్టులో తెలిపింది. మరింత విచారణ కోసం సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *