ఒకే వేదిక‌పై ముగ్గురు ముఖ్య‌మంత్రులు

ఒకే ఫ్రేమ్‌లో CBN, రేవంత్, DK

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. గుర‌వారం తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హోస్పేటలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరిపారు. సాధ్య‌మైనంత మేర‌కు సామ‌ర‌స్య పూర్వ‌కంగా నీటి పంప‌కాలు చేప‌ట్టాల‌ని కోరారు.

ఇప్పటికే ఆయా రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు మ‌రింత ముదురుకున్నాయి. ఈ సంద‌ర్బంగా ముగ్గురు సీఎంలు ఒకే వేదిక‌పైకి రావ‌డం, క‌లుసు కోవ‌డం, చ‌ర్చలు జ‌ర‌ప‌డం ఒకందుకు ఆశ్చ‌ర్యం అనిపించింది. అయితే పాలిటిక్స్ లో ఆరితేరిన చంద్ర‌బాబు నాయుడు కు శిష్యుడిగా పేరు పొందాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో క‌ర్నాట‌క సీఎంగా ఇటీవ‌లే కొలువు తీరిన డీకే శివ‌కుమార్ కు నారా చంద్ర‌బాబుతో మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య ఒప్పందాలు, లావాదేవీలు ఉన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *