రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

భ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి

అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఎంపీ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. నోవోటెల్ వద్ద భద్రత, వసతి ఏర్పాట్లను ప‌రిశీలించారు మంత్రి. అంతే కాకుండా జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారికి తగిన సూచనలు జారీ చేశారు.

ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి మీడియాతో మాట్లాడారు. దేశ ప్రథమ పౌరురాలి విశాఖపట్న పర్యటన విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్ర‌భుత్వం భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి నివాసం ఉండే చోట ముందు జాగ్ర‌త్త‌గా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు , స్తానికుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండానే సెక్యూరిటీని మ‌రింత క‌ట్టుదిట్టం చేయాల‌ని ఆదేశించామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *