వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. రుతురాజ్ గైక్వాడ్ ను ప్ర‌స్తుతానికి కెప్టెన్ గా కొన‌సాగిస్తున్నా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజు శాంస‌న్ పైనే ఎక్కువ‌గా ఆశలు పెట్టుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ధోనీ లాగానే త‌ను కూడా వికెట్ కీప‌ర్, కెప్టెన్ . అంతే కాకుండా మిస్ట‌ర్ కూల్ గా పేరు పొందాడు శాంస‌న్. దీంతో ఎంఎస్ కూడా త‌న వైపే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నాడు.

తాజాగా వ‌చ్చే 2027లో జ‌రిగే ఐపీఎల్ సీజ‌న్ లో ధోనీ ఆడ‌క పోవ‌చ్చ‌ని క్రికెట్ వ‌ర్గాల ద్వారా విశ్వ‌స‌నీయ స‌మాచారం. తన భవిష్యత్తు గురించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం MS ధోనీతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఈ దిగ్గజ కెప్టెన్ మరో సీజన్ ఆడాలని ఫ్రాంచైజీ ఆశిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే IPL 2027లో ధోనీ ఆటగాడిగా తిరిగి రావడం అసంభవంగా కనిపిస్తోంది. అయితే, ధోనీ వేరే ఏదైనా పాత్రలో జట్టుతో కొనసాగుతారని ఆశిస్తూనే, ఒక కొత్త శకంలోకి అడుగు పెట్టేందుకు CSK సన్నద్ధమవుతోంది.

  • Related Posts

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    ధృవ్ జురేల్ జోరు.. భార‌త్ భారీ స్కోర్

    శ్రీ‌లంక : కొలంబో వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు లో భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. 8 వికెట్లు కోల్పోయి 475 ప‌రుగులు చేసింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ధ్రువ్ జురెల్ అజేయ 95 పరుగులతో క్రీజులో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *