newsseals.com
News

20వ తేదీ లోపు పీసీసీకి నివేదిక అందిస్తాం : జ‌గ్గారెడ్డి

VijayaBhaskar July 14, 2026
newsseals-Jaggareddy

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో నియామకాలకు సంబంధించి ఈ రోజు పీసీసీకి ఇవ్వాల్సిన నివేదిక పోస్ట్ పోన్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ జ‌గ్గారెడ్డి మీడియాతో ఎమ్మెల్యే మందుల సామ్యూల్ తో క‌లిసి మాట్లాడారు. పూర్తిగా అన్ని అంశాలపై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు తెలిపారు జ‌గ్గారెడ్డి. ఇదిలా ఉండ‌గా ఈ నెల 18 లేదా 20 తేదీ లోపు పీసీసీకి నివేదిక అందజేస్తామని ప్ర‌క‌టించారు.

తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయ వ్యవహారాలపై రెండ్రోజుల పాటు అభిప్రాయాలు తీసుకున్నాం అని చెప్పారు. ఈరోజు సాయంత్రం తుంగతుర్తి నివేదికని పీసీసీకి ఇవ్వాలని అనుకున్నాం అని అన్నారు. కానీ ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ల అభిప్రాయలు తీసుకోవాల్సి ఉంద‌న్నారు జ‌గ్గారెడ్డి. వారి అభిప్రాయాలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు . అందరూ కలిసి సమన్వయంతో కలిసి పని చేసేలా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.