కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పై మందుల శామ్యూల్ ఫైర్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆధిపత్యంలో ఉన్నారని మీరు భావిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. కోమటిరెడ్డి సోదరులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మా గురించి ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు? చేతులు కట్టుకుని కూర్చుంటే వారు గెలవలేదు, మేమే గెలిచాం అన్నారు ఎమ్మెల్యే.

తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పనితీరు బాగోలేదని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు.. ముందు మునుగోడులో మీ సొంత గందరగోళాన్ని సరిదిద్దుకోండి అంటూ ఎద్దేవా చేశారు మందుల . ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పరిస్థితి మెరుగు పడలేదని నాకు కూడా సమాచారం అందింద‌న్నారు. ముందు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిందేన‌ని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లి రాహుల్ గాంధీని దూషించారు, ఆ తర్వాత ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారని, ఆయ‌న‌కు త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు.

  • Related Posts

    మొబైల్ ఫోన్ల వినియోగంపై సింగరేణి నిషేధం

    క‌రీంన‌గ‌ర్ జిల్లా : సింగ‌రేణి బొగ్గు గ‌నుల సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బొగ్గు గనుల్లో ప‌ని చేసే కార్మికులు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించిన‌ట్లు వెల్ల‌డించింది. భద్రతా కారణాలు, పని ప్రదేశాల్లో కార్మికులు ‘రీల్స్’ (చిన్న వీడియోలు) చిత్రీకరించే…

    ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్రచారం చేప‌ట్టాలి

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్ర‌చార‌ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *