100 శాతం డిజిటైజేష‌న్ చేసిన వారికి స‌న్మానం

హైద‌రాబాద్ : రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హూజూర్ న‌గ‌ర్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్ ఓట్ల ప్ర‌క్రియ‌పై స్పందించారు. ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు నమోదు డిజిటైజేషన్ కార్యక్రమం పురోగతిపై వచ్చిన నివేదికను పరిశీలించానని అన్నారు. మన నియోజకవర్గం, పట్టణం, మండలం, గ్రామం , బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు (BLAs) అందరికీ నా హృదయ పూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి బూత్‌లో కనీసం 95% ఓటరు నమోదు డిజిటైజేషన్ పూర్తి చేసే లక్ష్యంతో పని చేయాల‌ని కోరారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

ఇది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు . ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు సక్రమంగా నమోదు కావడం, ఒక్క నిజమైన ఓటరు కూడా మిగిలి పోకుండా చూడడం మనందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు . తమ తమ బూత్‌లలో 100% డిజిటైజేషన్ పూర్తి చేసిన కాంగ్రెస్ నాయకులు , బీఎల్‌ఏలను ఈ నెల 26వ తేదీన హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నా చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానిస్తానని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. అందరం సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెట్టాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    మొబైల్ ఫోన్ల వినియోగంపై సింగరేణి నిషేధం

    క‌రీంన‌గ‌ర్ జిల్లా : సింగ‌రేణి బొగ్గు గ‌నుల సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బొగ్గు గనుల్లో ప‌ని చేసే కార్మికులు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించిన‌ట్లు వెల్ల‌డించింది. భద్రతా కారణాలు, పని ప్రదేశాల్లో కార్మికులు ‘రీల్స్’ (చిన్న వీడియోలు) చిత్రీకరించే…

    ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్రచారం చేప‌ట్టాలి

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్ర‌చార‌ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *