శ్రీవారి సన్నిధిలో స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా
తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో భారత క్రికెట్ కు చెందిన ప్రముఖ స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా, తన కాబోయే భార్యతో కలిసి తిరుమలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు హార్దిక్ పాండ్యాకు వేద ఆశీర్వచనాలు, పవిత్ర తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అంతకు ముందు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆదివారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవలో పాల్గొన్నారు; ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన స్నేహితురాలు (ప్రచారంలో ఉన్న ప్రేయసి) మహికా శర్మ కూడా ఉన్నారు. పాండ్యా తెల్లవారుజామున కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని, నిర్దేశిత ప్రోటోకాల్ ఏర్పాట్ల ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తనను చూసేందుకు, కలిసేందుకు, కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు , క్రికెట్ అభిమానులు పోటీ పడ్డారు.