ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు రిలీఫ్

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఓటుకు నోటు కేసు . ఇందులో నిందితుడిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ కేసు విచార‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇదిలా ఉండ‌గా తాను విదేశాల‌లో ప‌ర్య‌టించాల్సి ఉంద‌ని, త‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న త‌ర‌పున పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది కేసును విచారిస్తున్న అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ).

ఓట్-నోట్ కేసులో మొదటి నిందితుడైన రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి కోరారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు షరతులతో కూడిన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఈ నెల ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, యూఎస్, జర్మనీ, చైనా పర్యటనకు వీలుగా ఓట్-నోట్ కేసులో స్వాధీనం చేసుకున్న తన పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును అభ్యర్థించారు

ఓట్-నోట్ కేసులో బెయిల్ షరతులను సడలించాలన్న అభ్యర్థనకు ప్రతిస్పందనగా, రూ.1 లక్ష పూచీకత్తు, విదేశాల్లోని చిరునామా, సంప్రదింపు వివరాలు అందించడంతో సహా పలు షరతులతో ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది.సెప్టెంబర్ 18 లోగా పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇస్తామని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది

  • Related Posts

    అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం ‘డ‌య‌ల్ 112’

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు తెలంగాణ పోలీస్ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర సేవ‌లు పొందేందుకు గాను నూత‌నంగా డ‌య‌ల్ 112 అత్య‌వ‌స‌ర సేవ‌ను ప్రారంభించింది. బుధ‌వారం దీనిని స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర…

    హైడ్రా కమిషనర్ సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసిన కాలేజీలు

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ద‌ర్జాగా కాలేజీలు నిర్వ‌హిస్తున్న యాజ‌మాన్యాలు ఏకంగా హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంత‌కాన్ని ఫోర్జరీ చేసిన బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది ఫైర్ ఎన్‌వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *