newsseals.com

పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై ఫోక‌స్ పెట్టాలి : వంశీ చంద‌ర్

August 11, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి సారించాల‌ని ఇది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు CWC ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్‌చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ వేదిక‌గా కాంగ్ర‌స్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా AICC పరిశీలకుల ఓరియంటేషన్ సమావేశం నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత , అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వంలో AICC ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కె.సి. వేణుగోపాల్ మార్గదర్శకత్వంలో సంఘటన్ సృజన్ అభియాన్ చేప‌ట్టారు.

ఇందులో భాగంగా AICC పరిశీలకుల ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, లడఖ్ లో నూతన DCC అధ్యక్షుల ఎంపిక కోసం నియమితులైన AICC పరిశీలకులకు ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, బాధ్యతలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. చ‌ల్లా వంశీచంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఎంపిక ప్ర‌క్రియ పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని సూచించారు. నిజాయితీ, నిబ‌ద్ద‌త క‌లిగిన వారితో పాటు పార్టీ కోసం ముందు నుంచి శ్ర‌మించిన వారికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు వంశీ చంద‌ర్ రెడ్డి.

Related News