newsseals.com

సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యం రైతులు సంతోషం

August 25, 2026 · VijayaBhaskar

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో ప్ర‌క‌టించిన ప‌రంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు శాస‌న స‌భ సాక్షిగా వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌డం వ‌ల్ల త‌మ విలువైన భూములు కోల్పోతామంటూ రైతులు, ప్ర‌జ‌లు గ‌త కొన్నేళ్లుగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. కానీ డీఎంకే , అన్నాడీఎంకే ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. దీనిపై ప‌రంధూర్ విమానాశ్ర‌య వ్య‌తిరేక పోరాట క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. చివ‌ర‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం టీవీకే స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీఎం స్పందించారు. ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు ఇబ్బంది క‌లిగించే ఏ ప్రాజెక్టును చేప‌ట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

బాధితులు, ప్ర‌జ‌లు, రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు. పరంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఏ ఒక్క‌రి భూమిని తాము తీసుకోవ‌డం లేద‌ని తెలిపారు సీఎం. దీంతో పరంధూర్, ఏచంకరణై వంటి గ్రామాల స్థానిక ప్రజలలో ఎంతో ఆనందాన్ని నింపింది. మంగ‌ళ‌వ‌వారం ‘పరంధూర్ విమానాశ్రయ వ్యతిరేక పోరాట కమిటీ’ సభ్యులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ నాయకుడు ‘తమిళ ఎజుచ్చి తమిళన్’ (తమిళ చైతన్య ప్రదాత) ఎంపీ తోల్ తిరుమావళవన్‌తో కలిసి పోరాటంలో పాల్గొనడాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో విమానాశ్రయ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ముందు వరుసలో నిలవడం ప‌ట్ల కృతజ్ఞతలు తెలిపారు.

Related News