newsseals.com
BUSINESS

వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

VijayaBhaskar July 28, 2026
newsseals-QuantumValley

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని సీఎం సూచించారు. కాలుష్యం లాంటి బాహ్య కారణాల వల్ల కూడా ప్రమాదకరమైన కాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ముందే గుర్తించి చికిత్సలు అందించటం ద్వారా రోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

వైద్య రంగంలోని వ్యవస్థలు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో పని చేయాలని సీఎం సూచించారు. ఏపీలో సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రికార్డులుగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్యారోగ్య రంగంలో మరింత వేగంగా ట్రాన్సఫర్మేషన్ జరగాల్సి ఉందని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. కేన్సర్ తో పాటు ఇతర వ్యాధులపై కూడా అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి విస్తృతంగా పరిశోధనలు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ జి.సాయి ప్రసాద్, ఆస్ట్రాజెనెకా ఇండియా ఎండీ ఏ. ప్రవీణ్ రావు , స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థల ప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.