జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్క‌డా ఇసుమంత గ‌ర్వం అన్న‌ది లేని నాయ‌కుడు గుమ్మ‌డి న‌ర్స‌య్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. మనందరికీ ఆదర్శప్రాయుడు, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కూడా సాధారణ జీవితం గడిపిన, గడుపుతున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు క‌విత‌.

త‌న జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు . వారి చరిత్ర మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారత దేశంలో సినిమాగా రావటం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వ కార‌ణం అన్నారు క‌విత‌.. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాల‌ని, ప్రేక్షకుల ఆదరణ పొందాలని, రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి యువతకు స్ఫూర్తి నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

  • Related Posts

    చిరంజీవి ‘బ్రాండ్ అంబాసిడ‌ర్’ నియామ‌కం అబ‌ద్దం

    అమ‌రావ‌తి : గ‌త కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు చిరంజీవి టీం. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా…

    డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియ‌స్

    ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *