తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

VijayaBhaskar · February 2, 2026
Spread the love

స్వామి వారి కోసం పోటెత్తిన భ‌క్త బాంధ‌వులు

తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. మాఘ‌ శుద్ధ పౌర్ణమి సంద‌ర్బంగా పుణ్య క్షేత్రం లో గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ జెబుతున్నాడు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో వీర‌బ్ర‌హ్మం, జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ పాల్గొన్నారు. స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.