ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడుకోవాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరంలో గత పదేళ్లలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాల పునరుద్ధరణ ప్రారంభించినప్పుడు కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారని అన్నారు. ప్రజాహితం కోసం అవన్నీ మౌనంగా భరించాన‌ని చెప్పారు సీఎం. ఈ రోజు ఫలితాలు చూస్తుంటే, ప్రజల స్పందన చూస్తుంటే వాళ్ల ఆరోపణలే నాకు ఆశీర్వాదాలుగా మారాయని అనిపోస్తోంద‌ని చెప్పారు.

పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇళ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. వరదలు వచ్చినపుడు పేదలు ముంపు బాధితులుగా మిగల కూడదు అనేది మా తపన అన్నారు సీఎం. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి నా సూచన. మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రకృతి పునరుద్ధరణ కు సహకరించాలని కోరారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తాం అన్నారు. పిల్లల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Related Posts

రెఫ‌ర‌ల్ ఆస్ప‌త్రిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి

హైద‌రాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ‘రెఫరల్ కేంద్రం’గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్ర‌క‌టించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇక్కడ…

ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణికి కొత్త ఊపిరి : భ‌ట్టి

హైద‌రాబాద్ : ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణి ప‌రిర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌తో పాటు రాష్ట్ర ఇంధ‌న భ‌ద్ర‌త‌ను సుస్థిరం చేయాల‌న్న సంక‌ల్పంతో గ‌త 30 నెల‌లుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తూ సింగ‌రేణికి కొత్త ఊపిరి ల‌భిస్తోంద‌ని, ఈ రోజు కేంద్ర బొగ్గు మంత్రిత్వ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *