14.43 ల‌క్ష‌ల మంది రైతుల‌కు విజ‌య్ రుణ‌మాఫీ

తమిళనాడు ముఖ్య‌మంత్రి సంచలన నిర్ణయం
చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల హామీలో భాగంగా రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఆ మేర‌కు బుధ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను రైతు ప‌క్ష‌పాతిన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు సీఎం.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో స‌హ‌కార రంగంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా సాగు కోసం రుణాలు తీసుకున్న రైతుల‌కు ఒక్కొక్క‌రికి రూ.75,000 మేరకు వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14.43 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.5,932 కోట్ల మేర భారం పడనుంది. అయినా వెన‌క్కి త‌గ్గేది లేదంటూ స్ప‌ష్టం చేశారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *