ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు

మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ సంస్థ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడ‌ని, గ‌త కొన్నేళ్లుగా త‌మ సంస్థ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌. RSS ఒక సంస్థగా నమోదు చేసుకోవాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై భ‌గ‌వ‌త్ స్పందించారు.

ఆ చర్య రాజకీయ ప్రేరేపితమని, ప్రజల మనసుల్లో అనుమానాలు సృష్టించే ఉద్దేశంతో కూడుకున్నదని RSS చీఫ్ అన్నారు. అనేక విషయాలు నమోదు కాకుండానే ఉన్నాయి… హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ నిధులు అవసరమైన వారు మాత్రమే నమోదు చేసుకుంటారని స్ప‌ష్టం చేశారు. మా ఉనికి గురించి ప్రభుత్వానికి తెలుస అన్నారు. ; గతంలో ప్రభుత్వం మమ్మల్ని రెండుసార్లు నిషేధించింది కూడా అని మ‌రోసారి గుర్తు చేశారు మోహన్ భగవత్ .

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *