సీఎం విజ‌య్ తో సిలాంబ‌ర‌స‌న్ భేటీ

సినీ, రాజ‌కీయ రంగ ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌

చెన్నై : త‌మిళ సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు , సాంకేతిక నిపుణులు అగ్ర న‌టుడు, సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో భేటీ అయ్యేందుకు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే న‌టీమ‌ణులు త‌న‌ను క‌లిసి అభినందించారు. ముఖ్యంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు , ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ సుంద‌ర్ ప‌లుమార్లు విజ‌య్ ను క‌లిసారు. త‌న‌కు అత్యంత ఆత్మీయుడైన వ్య‌క్తి, స‌హ‌చ‌రుడంటూ పేర్కొన్నారు. గ‌తంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చారు.

ఇక మ‌రో అగ్ర వ‌ర్ద‌మాన న‌టి సిమ్రాన్ సైతం త‌న కుటుంబంతో క‌లిసి సీఎం విజ‌య్ తోను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకుంది. త‌న‌తో తాను క‌లిసి న‌టించిన సినిమాల‌ను గుర్తు చేసుకుంది. తాజాగా స్టార్ హీరో గా గుర్తింపు పొందిన సిలాంబ‌ర‌స‌న్ సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యాడు. త‌న‌ను క‌ల‌వ‌డం చెప్ప‌లేని సంతోషంగా ఉంద‌న్నాడు. త‌న‌కు సోద‌రుడు లాంటి వాడ‌ని విజ‌య్ ని ప్ర‌శంసించాడు. తమిళనాడు ప్రజలకు సేవ చేస్తున్న ఆయనకు శక్తి, విజయం, దేవుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు సిలాంబ‌ర‌స‌న్.

  • Related Posts

    చిరంజీవి ‘బ్రాండ్ అంబాసిడ‌ర్’ నియామ‌కం అబ‌ద్దం

    అమ‌రావ‌తి : గ‌త కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు చిరంజీవి టీం. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా…

    డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియ‌స్

    ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *