ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

అత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్కారం

స్లోవేకియా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ప్ర‌పంచంలో అత్యున్న‌త నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా యుద్దాన్ని నివారించ‌డంలో , శాంతి కోసం ప్ర‌య‌త్నం చేయ‌డంలో, ఆయా దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాల‌ను నెర‌ప‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు. యుద్దాన్ని నిర‌సించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రి త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఫ్రాన్స్ లో జ‌రిగిన జి7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. అనంత‌రం స్లోవేకియా దేశంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆ దేశం అత్యున్న‌త పౌర పుర‌స్కారం మోదీకి ల‌భించింది.

“ది ఆర్డర్ ఆఫ్ దివైడ్ డబల్ క్రాస్” తో మోడీని సత్కరించారు స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వరకు 33 అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకుని రికార్డు సృష్టించారు ప్రధాని మోదీ. ఈసంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని ప్ర‌క‌టించారు. భారత్, స్లోవేకియా సుదీర్ఘ స్నేహ బంధానికి ఈ పురస్కారం అంకితం చేస్తున్న‌ట్లు తెలిపారు. పదవి చేపట్టిన నాటి నుంచి 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. పీఎం హోదాలో ఇప్పటి వరకు 78 దేశాలు సందర్శించారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *