కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు రౌడీషీట‌ర్ లాక‌ప్ డెత్ పై స్పందించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. రౌడీషీటర్ సాయికృష్ణ లాక్ అప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెండ్ చేసింది స‌ర్కార్. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని ఆదేశించారు. ఈరోజు డీజీపీని పిలిపించి స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా నాగరాజు ను వీ ఆర్ కు బదిలీ చేసిన విజయవాడ కమిషనర్.

కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారడంతో సీరియస్ గా పరిగణించారు సీఎం. నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం సూచించడంతో సాయంత్రం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ గుప్తా. మరోవైపు సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.. నాగరాజు దోషిగా తేలితే చట్టపరంగా కేసులు పెట్టీ అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *