డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు


కీలక సూచ‌న‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కాగిత ర‌హిత పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వ‌హించారు. డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. పేపర్‌లెస్’ (కాగిత రహిత) పాలన వైపు మళ్లుతున్న తరుణంలో, మంత్రివర్గ సమావేశ అజెండా , పత్రాలను డిజిటల్ విధానంలో చూసుకునేందుకు వీలుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రత్యేక టాబ్లెట్‌ను అందజేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ,

మంత్రులు కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, ఇటీవలి రాజకీయ పరిణామాలు, మెట్రో రెండో దశ (Phase-2) అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో పండిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే సేకరించేలా చూడటంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కాగా, కాగిత రహిత పాలన దిశగా అడుగులు వేస్తూ, ప్రభుత్వం ‘తెలంగాణ డిజిటల్ క్యాబినెట్’ విధానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఈ కొత్త విధానాన్ని సమీక్షించగా, మంత్రివర్గ సమావేశ అజెండా, పత్రాలను డిజిటల్ రూపంలో వీక్షించేందుకు వీలుగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మంత్రులకు ప్రత్యేక టాబ్లెట్‌లను పంపిణీ చేశారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *