డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హ‌రి లాక‌ర్ల‌లో నోట్ల క‌ట్ట‌లు

ఇటీవ‌లే రిమాండ్ కు త‌ర‌లించిన పోలీసులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారంద‌రినీ ఒక్కరొక్క‌రుగా టార్గెట్ చేస్తూ దాడుల‌కు దగుతోంది. ఈ త‌రుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు. ఆయ‌న‌కు సంబంధించి కిలోల కొద్ది బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను, ఫ్లాట్స్, ప్లాట్లు, భ‌వ‌నాలు, పొలాల‌కు సంబంధించి విలువైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. శ‌నివారం తాజాగా ఏసీబీ అధికారులు న‌ర‌హ‌రి రావుకు చెందిన ఆయా బ్యాంకుల‌లో లాకర్లను తెరిచారు.

దిమ్మ తిరిగేలా భారీ ఎత్తున నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డ్డాయి. వాటిలో రూ.1.5 కోట్లను సీజ్ చేశారు. ఆ నోట్లకట్టలతో టేబుల్ నిండి పోయింది. ఇటీవల అతడి ఇళ్లలో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించారు. హైదరాబాద్‌లో పలు బిల్డింగులతో పాటు బ్యాంకుల్లోని రూ.5 కోట్ల విలువైన FDలు, ఖాతాలో రూ.2.29 కోట్లు, 1.3 KGల బంగారం, 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకెన్ని చోట్ల నోట్ల‌ను దాచి ఉంచార‌నే దానిపై పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీలో మ‌రో అవినీతి తిమిలింగాన్ని ప‌ట్టుకుంది ఏసీబీ.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *