పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష

12 ఏళ్ల బాలిక‌పై ప‌లు మార్లు అత్యాచారం

హైద‌రాబాద్ : పోక్సో కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల లోకి వెళితే POCSO కేసులో 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించారు పోక్సో కోర్టు న్యాయ‌మూర్తి. మానసిక వైకల్యం ఉన్న 12 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి, తన ఇంటికి తీసుకెళ్లి, పలుమార్లు అత్యాచారం చేశాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వెంకట నారాయణ. త‌న వ‌య‌సు 84 ఏళ్లు.

ఈ దారుణ‌మైన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మార్చిలో చోటు చేసుకుంది. అనుమానం వచ్చి బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకట నారాయణను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక POCSO కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై కోర్టు తీర్పు ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. మ‌రో వైపు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌న‌యుడు సైతం పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. కానీ ఇంకా శిక్ష ఖ‌రారు కాలేదు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *