హైకోర్టు ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహం

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టులో దళిత వర్గాల సుదీర్ఘ స్వప్నం త్వరలో నేరవేరనుంది, తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు తనని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దళిత న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ తన ఆనందాన్ని పంచుకున్నారు .ఈసందర్భంగా మాట్లాడుతూ రెండేళ్ల క్రితమే హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగినా కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం రూపు దాల్చలేదు.అయితే నేడు చీఫ్ జస్టిస్ ఇచ్చిన స్పష్టమైన హామితో నవంబర్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవం నాటికి హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఏర్పాటు మార్గం సుగమం అయింది

ఈసందర్భంగా చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ కి శాలువా, బోకే బహుకరించి తమ ఆనందాన్ని సాటి న్యాయవాదులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ మాదిగ కన్వీనర్ దున్న అంబేడ్కర్, గౌరవ అధ్యక్షులు ఇనుగాల భీమా రావు, శ్రీలత, పారిజాత,రామకృష్ణ, సుమిత్ర, యాదీశ్వర్ తదితర న్యాయవాదుల బృందం సీజేకి శుభాకాంక్షలు తెలిపారు. త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు చీఫ్ జ‌స్టిస్ ఆప‌రేష్ కుమార్. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం త‌న బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    నాకెందుకు షోకాజ్ నోటీసులు ఇస్తారు..?

    హైద‌రాబాద్ : రాష్ట్ర దేవాదాయ‌, ద‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న కూతురు కొండా సుష్మితా ప‌టేల్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాష్ రెడ్డిని, సీఎం బ్ర‌ద‌ర్స్ కొండ‌ల్ రెడ్డి, తిరుప‌తి…

    గ్లోబ‌ల్ నాలెడ్జ్ హ‌బ్ గా హైద‌రాబాద్ : సీఎం

    లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *