కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్ల ఎత్తివేత
నిర్మల్ జిల్లా : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి వరద కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు నిన్నటి దాకా వెల వెల బోతుండగా ఇవాళ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు నీళ్లు రావడంతో నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈమేరకు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గురువారం దిగువ ప్రాంతాలకు 48, 000 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్కు 73,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
దిగువ ప్రాంతాలకు 48,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ యొక్క ఆరు గేట్లను గురువారం తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తెరిచారు. మహారాష్ట్రలోని నాసిక్ , దాని పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి; దీనివల్ల కడెం ప్రాజెక్ట్కు వచ్చే నీటి ప్రవాహం మరింత పెరగవచ్చు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు, అలాగే నీటి మట్టాలు తగ్గే వరకు గొర్రెల కాపరులు బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు.