ఎత్తిపోత‌ల ప‌థ‌కాల నిర్మాణాలు వేగ‌వంతం చేయాలి

అమ‌రావ‌తి : ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు . విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో చేప‌ట్టిన ఎత్తిపోత‌ల ప‌థ‌కాల నిర్మాణాలు వేగ‌వంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ, పుష్కర లిఫ్ట్ స్కీం పైప్ లైన్ పనులపై ఆరా తీశారు. ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఎస్ఈ ఏసుబాబు , ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. హైవే క్రాసింగ్ ల దగ్గర వంతెనల నిర్మాణాల పనులను ఇటీవలే క్షేత్రస్దాయిలో పరిశీలించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా పనులు ఆశించిన స్దాయిలో జరగకపోవడంపై అధికారులు, ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిపై సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సిఎం ఆదేశాల ప్రకారం నేడు మరో మారు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో వర్క్ షెడ్యూల్ పై సూచ‌న‌లు చేశారు. హైవే క్రాసింగ్ ల దగ్గర కొత్తగా నిర్మించిన వంతెనలతో, జాతీయ రహదారి అనుసంధానంపై ఎన్‌హెచ్ ప్రతినిధులతో సంప్రదింపులు చేయాలని నీటి పారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సిఎం ఆదేశాల ప్రకారం ఆగష్టులోనే అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకెళ్ళేలా పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కర లిఫ్ట్ స్కీం పైప్ లైన్ పనులు పూర్తి చేయడానికి షెడ్యూల్ ప్రకారం పనులు చేయాల్సిందేన‌ని పేర్కొన్నారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *