అమరావతి : గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు చిరంజీవి టీం. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి నియామకంపై వస్తున్న వార్తలను ఆయన బృందం ఖండించింది. ఈ సీనియర్ నటుడిని రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలు అవాస్తవం , నిరాధారమైనవి అని పేర్కొంది. ధృవీకరించని వార్తలను ప్రచురించ వద్దని మీడియాను కోరింది. గత రెండు రోజులుగా ఆయన గురించి వస్తున్న వార్తలను మేము ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.
గత రెండు రోజులుగా ఆయన గురించి వస్తున్న వార్తలను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము అని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సీనియర్ నటుడిని రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని యోచిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం కాదు, సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు ఎలా వ్యాపించాయో మాకు అర్థం కావడం లేదు అని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు (APFDC) చెందిన ఒక అధికారి కూడా ధృవీకరించారు. ఆయన బృందం తెలిపిన వివరాల ప్రకారం, చిరంజీవి ప్రస్తుతం తన సినిమాలపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేయబోయే తదుపరి చిత్రం పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు.







