సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం

త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి భ‌రోసా ఇచ్చిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీలో సంచ‌ల‌నం రేపింది విజ‌య‌వాడ కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వ్య‌వ‌హారం. రౌడీ షీట‌ర్ సాయికృష్ణ‌ను లాక‌ప్ డెత్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్య‌వ‌హారంలో త‌న‌ను స‌స్పెండ్ చేసింది స‌ర్కార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర‌కు . ఇదిలా ఉండ‌గా గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు ధైర్యం చెప్పారు.

ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. విజయలక్ష్మితో మాట్లాడి మొత్తం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *