కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే పలువురు నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.

అర్హులైన నేతన్నలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. చేనేతల సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. అర్హులైన నేతన్నల కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, ఏమైనా అనుమానాలు ఉంటే సమీపంలో చేనేత, జౌళి శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి సవిత సూచించారు.

  • Related Posts

    హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

    హైద‌రాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…

    విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో మరో ముందడుగు

    నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : నాగర్‌కర్నూల్ సర్కిల్ పరిధిలోని పెద్దముద్దునూరు 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో 5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR) స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 8…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *