హైదరాబాద్ : ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో 3 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు TPCC పరిశీలకులకు AICC ఆమోదం తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్, మాజీ ఎంపీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు లేఖ ద్వారా ఈ వివరాలను తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు ( 9696619999), ఎం.డి. రియాజ్( 9849022931), నెరెల్ల శారద ( 9866047777)ను ఎంపిక చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం టేల్ రమేష్ రెడ్డి ( 9848180201), ఈ.వి. శ్రీనివాస్ ( 9849379700) డా. రాగమయి, ఎమ్మెల్యే ( 9885259639)ను ఎంపిక చేసింది ఏఐసీసీ.
ఇక రామగుండం కార్పొరేషన్ (సిటీ DCC) అధ్యక్షుడి ఎంపిక కోసం ఎం.ఏ. ఫయీమ్ (సంగారెడ్డి) (7997996655), బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ( 9440334455), రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ( 851999171)లను ఎంపిక చేసింది. ఈ పరిశీలకులు ఆయా జిల్లాలకు సంబంధించిన AICC పరిశీలకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారని స్పష్టం చేశారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్.






