Category: DEVOTIONAL
DEVOTIONAL
-

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై సమీక్ష
మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలి తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ…
-

బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆర్జిత సేవలు రద్దు
ప్రకటించిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 25 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్బంగా జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారని వెల్లడించారు. 17వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి…
-

శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. అంతకు ముందు ఏర్పాట్లను పరిశీలించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి…
-

శ్రీవారి అన్న ప్రసాదం అద్భుతం
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. తన కుటుంబంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం వద్దకు వెళ్లారు. అక్కడ మహా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన అద్వితీయమైన ఆనందానికి లోనయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా. దయచేసి తిరుమలకు వెళ్లే భక్త…
-

తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం
తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుమల : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది. దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి తీసుకు వచ్చారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్ప స్వామి వారిని చిన్న గజ వాహనంపై వాహన మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అదే విధంగా అందంగా అలంకరించి…
-

శ్రీ పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వెల్లడించిన టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు. ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ…
-

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
పెద్ద ఎత్తున హాజరైన భక్తులు తిరుపతి : తిరుపతి లోని సుప్రసిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామి వారిని అర్చించారు. సాయంత్రం శ్రీ…
-

కోటి దీపోత్సవం అద్భుతం : సీఎం
ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలొ నిర్వహిస్తాం హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆంధ్రాకు చెందిన ఓ ఛానల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. మీ మధ్య గడపడం నాకు జీవిత కాల జ్ఞాపకంగా గుర్తుండి పోతుందన్నారు రేవంత్ రెడ్డి. గత 14 సంవత్సరాలుగా రచన టెలివిజన్ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, వారికి అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు.…
-

సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస
నివాళులు అర్పించిన మంత్రి లోకేష్ అనంతపురం జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త దాస 538వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య…
-

భక్తులకు సాంప్రదాయ ఆహారం అందించాలి
తిరుమలలోని దుకాణాదారులకు ఏఈవో ఆదేశం తిరుమల : తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











